Srinivas | హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్వాలియర్ వేదికగా జరిగిన 51వ జాతీయ సీనియర్ క్యారమ్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ టైటిల్ విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల ఫైనల్లో శ్రీనివాస్(పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు) 25-0, 25-9తో ఆదిత్య(తెలంగాణ)పై అద్భుత విజయం సాధించాడు.
ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో శ్రీనివాస్ తనదైన రీతిలో సత్తాచాటాడు. మరోవైపు మహిళల టీమ్ చాంపియన్షిప్ తుది పోరులో తెలంగాణ 0-3 తేడాతో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. విజేతలను రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది.