సైదాబాద్: సైదాబాద్ జువెనైల్ హోమ్కు చెందిన బాలుడు రాష్ట్ర స్థాయి ఆర్చరీ టోర్నీకి ఎంపికయ్యాడు. రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కరీంనగర్లో జరిగే టోర్నీలో సదరు బాలుడు బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చడం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. కరీంనగర్లో జరిగే టోర్నీలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ఆర్చరీ ప్లేయర్లు అండర్-14, 16 విభాగాల్లో పోటీపడబోతున్నారు.
పక్షం రోజుల శిక్షణలోనే రాష్ట్ర స్థాయికి ఎదగడం పట్ల జువెనైల్ స్కూల్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చరీ కోచ్ హేమలత ట్రైనింగ్లో రాటుదేలిన ఈ బాలుడు సత్తాచాటుతానని ధీమా కనబరుస్తున్నాడు. ఆర్చరీ పోటీలకు ఎంపికైన జువెనైల్ బాలుడిని రాష్ట్ర మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బాలుడిని భవిష్యత్లో ఏమీ అవుతావని ప్రశ్నించగా ఒలింపిక్స్లో ఆడటమే తన లక్ష్యంగా చెప్పాడని జువెనైల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ మీర్జా రజా అలీబేగ్ తెలిపారు.