Dhruv Jurel : రాంచీ టెస్టులో అసమానం పోరాటంతో భారత్కు అద్భుత విజయాన్ని అందించిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఫీట్ సాధించాడు. అరంగేట్రం టెస్టు సిరీస్(Debut Test Series)లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దాంతో, భారత టెస్టు చరిత్రలో 22 ఏండ్ల తర్వాత ఈ అవార్డు అందుకున్న తొలి వికెట్ కీపర్గా జురెల్ రికార్డు సృష్టించాడు.
మొత్తంగా.. తొలి సీరీస్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. జురెల్ కంటే ముందు అజయ్ రత్రా (Ajay Ratra) ఈ ఘనత సాధించాడు. 2002లో వెస్టిండీస్పై టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన అజయ్.. 115 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
అజయ్ రత్రా
సిరీస్లో కీలకమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్ ద్వయం షోయబ్ బషీర్, టామ్ హర్ట్లే హడలెత్తించారు. వాళ్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత్ 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో జురెల్ సంచలన ఆటతో జట్టును ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడేశాడు. కుల్దీప్ యాదవ్తో 70 పరుగులు, పేసర్ ఆకాశ్ దీప్తో కలిసి 40 పరుగులు జోడించాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చకున్న అతడు భారత స్కోర్బోర్డును 300 దాటించాడు.
శుభ్మన్ గిల్(55 నాటౌట్), జురెల్ (39 నాటౌట్)