హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీని.. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గురువారం హైదరాబాద్లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్నీ ఆరంభ వేడుకలకు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం క్రీడా రంగంలో దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపీచంద్, చాముండేశ్వరినాథ్, శేఖర్ చంద్ర బిస్వాస్, చలసాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.