టీ20 వరల్డ్ కప్ 2021లో ఇప్పటి వరకు హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి కానీ.. సెంచరీ నమోదు కాదు. తాజాగా షార్జా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2021లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ పార్ట్నర్షిప్తో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. 67 బంతుల్లో 101 పరుగులు చేసి 6 ఫోర్లు, 6 సిక్సులు సాధించాడు బట్లర్. స్ట్రయిక్ రేట్ కూడా 150.74 గా ఉంది.