టీ20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన కొన్ని గంటల్లోనే స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో గాయపడినట్లు ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్) ప్రకటించింది. శుక్రవారం నాడు గోల్ఫ్ ఆడుతుండగా బెయిర్స్టో ప్రమాదానికి గురయ్యాడని, దాంతో టీ20 ప్రపంచకప్లో అతను ఆడటం కుదరదని వెల్లడించింది. వచ్చే వారం అతను స్పెషలిస్టులను కలుస్తాడని, ఆ తర్వాత గాయం ఎంత తీవ్రమైనదో తెలుస్తుందని ఈసీబీ పేర్కొంది.