IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్లో యశస్వీ జైస్వాల్(37 : 44 బంతుల్లో) ఔటయ్యాడు. బ్యాక్వర్డ్ పాయింట్లో అండర్సన్ డైవింగ్ క్యాచ్ పట్టడంతో యశస్వీ నిరాశగా వెనుదిరిగాడు. దాంతో, 84 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది.
ఆ కాసేపటికే టామ్ హర్ట్లే బౌలింగ్లో రోహిత్ శర్మ(51 : 70 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) రెండు పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో హిట్మ్యాన్కు ఇది 17వ హాఫ్ సెంచరీ. మరో ఎండ్లో శుభ్మన్ గిల్(2) ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన విజయానికి ఇంకా 102పరుగులు కావాలి.
1⃣7⃣th Test fifty for Rohit Sharma 👌 👌
Talk about captain leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/PymznAtOLZ
— BCCI (@BCCI) February 26, 2024
మూడో రోజు ఇంగ్లండ్ను క145 పరుగులకే కట్టడి చేసిన భారత్.. మ్యాచ్పై పట్టు బిగించింది. 192 పరుగుల ఛేదనలో ఓపెనర్లు యశస్వీ, రోహిత్ ధనాధన్ ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 40 రన్స్ కొట్టింది.