హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే తనదైన రీతిలో సత్తాచాటుతున్న దీప్తి 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ13/టీ20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి 56.71సెకన్ల టైమింగ్తో టాప్లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దీప్తి అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఇదే విభాగంలో పూజ(హర్యానా), భారతి(రాజస్థాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. స్వర్ణ పతకం సాధించిన దీప్తిని జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.