Jayawardene Supports Pant | నోబాల్పై వివాదానికి తావు లేకుండా క్రికెట్ చట్టాలను మార్చాలని మంబై ఇండియా హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ టోర్నీలో వికెట్ల ఎత్తులో ఫుల్ టాస్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్లు నో బాల్ అని ప్రకటిస్తారు. ఒకసారి అంపైర్లు నిర్ణయం తీసుకున్నా.. వారితో వాదించడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది.
ఈ ఘటనే రాజస్థాన్-ఢిల్లీ జట్ల మధ్య జరిగింది. నో బాల్ వివాదాస్పదం కావడంతో ఢిల్లీ డేర్ డేవిల్స్ సారధి రిషబ్ పంత్, ఆయన సహాయ సిబ్బంది ఆవేశ ఆవేశ పడ్డారు. బ్యాట్స్మన్లను బయటకు వచ్చేయమన్నారు. కానీ అంపైర్లు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. కానీ దీనిపై చర్చ ప్రారంభమైంది.
రిషబ్ పంత్కు మహేలా జయవర్దనే మద్దతు పలికాడు. కానీ ఢిల్లీ డేర్ డేవిల్స్ కోచింగ్ స్టాఫ్ గ్రౌండ్లోకి వచ్చి వాదించడం బాగోలేదని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అన్నాడు. ప్రస్తుత క్రికెట్ చట్టం ప్రకారం 21.5 నిబంధన ప్రకారం బౌలర్ ఫ్రంట్ ఫుట్ను పరిశీలించాక అది నో బాల్ అయితేనే చెప్పాలి. ఆ అంశాన్ని బౌలర్ ఎండ్ అంపైర్కు నివేదించాలని అన్నాడు.