దుబాయ్: భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-10లోకి వచ్చాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో తొమ్మిది వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఐసీసీ ర్యాకింగ్స్లో పది స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంకుకు చేరాడు. కాగా బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (6), రిషబ్ పంత్ (7) టాప్-10లో ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు.