Jasprit Bumrah | న్యూఢిల్లీ: వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్ పర్యటనకు భారత సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సాధన చేస్తున్న బుమ్రా..
పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరి గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్తో పొట్టి సిరీస్కు తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చిన తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. ఐర్లాండ్ సిరీస్కు కూడా ఎంపికయ్యాడు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, అవేశ్ ఖాన్.