ICC Rankings | స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు ద్విశతకాలు సాధించిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. హైదరాబాద్ టెస్టులో 80లలోకి వచ్చి సెంచరీ మిస్ చేసుకున్న యశస్వీ.. వైజాగ్, రాజ్కోట్లలో మాత్రం వరుసగా రెండు డబుల్ సెంచరీలు కొట్టాడు. తద్వారా అతడు ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో 14వ స్థానాలు పైకి ఎగబాకిన అతడు.. 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.
రాజ్కోట్ టెస్టుకు ముందు 29వ ర్యాంకులో ఉన్న జైస్వాల్.. తాజాగా 15వ స్థానానికి ఎగబాకాడు. జైస్వాల్ 699 పాయింట్లతో ఈ ర్యాంకుకు చేరాడు. కాగా ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్ -10లో ఉన్నాడు. కోహ్లీ.. 752 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి 12వ ర్యాంకుకు చేరాడు. రాజ్కోట్ టెస్టులో 88 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్.. 12 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరాడు. రాజ్కోట్లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా.. 7 స్థానాలు మెరుగుపరుచుకుని 34వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Yashasvi Jaiswal continued his stellar start to Test match cricket with his second double century in a row 🌟
More on the records broken by him and the team 👉 https://t.co/57rYliWXk3#WTC25 | #INDvENG pic.twitter.com/uTU2N09ysF
— ICC (@ICC) February 18, 2024
టెస్టు బౌలర్ల జాబితాలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా రాజ్కోట్ టెస్టులో 500వ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో స్థానానికి చేరాడు. రవీంద్ర జడేజా 3 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకుకు చేరాడు. టాప్ -10లో ముగ్గురు భారత బౌలర్లే ఉండటం గమనార్హం.