బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపు బాట పట్టింది. శుక్రవారం జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 31-26తో పుణెరి పల్టన్పై విజయం సాధించింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సూపర్-10 సాధించగా.. పుణెరి తరఫున అస్లమ్ ఇనామ్దార్ (6) రాణించాడు. ఈ ఫలితంతో జైపూర్ 18 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకగా.. పల్టన్ 11 పాయింట్లతో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 41-37తో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది.