హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు (ఈ నెల 17)ను పురస్కరించుకుని భారత జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నీ జరుగనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 15, 16 తేదీల్లో జరుగనున్న వాలీబాల్ టోర్నీ పోస్టర్ను సోమవారం ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్లేయర్ల ప్రతిభను వెలికితీయడంతో పాటు క్రీడలను ప్రోత్సహించేందుకు వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ కప్ పేరిట జాగృతి ఆధ్వర్యంలో పురుషుల, మహిళల వాలీబాల్ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్లేయర్లు పోటీపడుతున్నారు. టోర్నీలో విజేతకు ట్రోఫీ తో పాటు లక్ష రూపాయలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లకు వరుసగా 75వేలు, 50వేల నగదు బహుమతి అందిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.