హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శైలజ రామయ్యర్ను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి జగన్మోహన్రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతమైన ఆమె నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడలు మరింత అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అక్టోబర్లో గోవాలో జరిగే జాతీయ క్రీడలకు హ్యాండ్బాల్ సంఘం తరఫున శైలజను ఆయన ఆహ్వానించారు. సమీప భవిష్యత్లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు బిడ్ దాఖలు చేయడంతో పలు అంశాలపై జగన్ చర్చించారు.