IPL 2023 : వారెవ్వా.. వాట్ ఏ మ్యాచ్.. రిజర్వ్ డే రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్నిచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన పోరులో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రవీంద్ర జడేజా(15 నాటౌట్ : 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ) సంచలన బ్యాటింగ్తో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై జట్టు ఐదు టైటిళ్లతో ముంబై ఇండియన్స్ రికార్డు సమం చేసింది. దాంతో, ఆఖరి ఓవర్ దాకా పోరాడిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్కు నిరాశ తప్పలేదు.
మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో చెన్నై విజయానికి 13 రన్స్ అవసరమయ్యాయి. తొలి నాలుగు బంతులకు 3 రన్స్ వచ్చాయి. దో బంతికి రవీంద్ర జడేజా(15) లాంగాన్లో సిక్స్ బాదాడు. ఆఖరి బాల్కు ఫోర్ కొట్టాడు. దాంతో, చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే(32) నాటౌట్గా నిలిచాడు.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
Two shots of excellence and composure!
Finishing in style, the Ravindra Jadeja way 🙌#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/EbJPBGGGFu
— IndianPremierLeague (@IPL) May 29, 2023
సెకండ్ ఇన్నింగ్స్కు వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. దాంతో ఆటను 15 ఓవర్లకు కుదించడంతో చెన్నై టార్గెట్.. 171గా నిర్ధేశించారు. చెన్నై ఇన్నింగ్స్ 12ః10కి మొదలైంది. కావాల్సిన రన్రేటు 11పైనే ఉండడంతో ఓపెనర్లు డెవాన్ కాన్వే(47), రుతురాజ్ గైక్వాడ్(26) దంచారు. కానీ నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో వీళ్లిద్దరినీ ఔట్ చేశాడు. ఆ తర్వాత అజింక్యా రహానే(27), చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు(19),ఎంఎస్ ధోనీ(0) ను మోహిత్ శర్మ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే(32), రవీంద్ర జడేజా(15 నాటౌట్ : 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ ఆడారు. ఆఖరి బంతికి జడ్డూ ఫోర్ బాదడంతో చెన్నై చాంపియన్గా నిలిచింది.
A fairytale ending 😇
Congratulations to #TATAIPL 2023 Champion Ambati Rayudu on a remarkable IPL career 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT | @RayuduAmbati pic.twitter.com/4U7N3dQdpw
— IndianPremierLeague (@IPL) May 29, 2023
ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. సొంత గ్రౌండ్లో టాపార్డర్ బ్యాటర్లు దంచి కొట్టారు. గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్(39) విఫలమైనా.. సాయి సుదర్శన్(96 : 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు), వృద్ధిమాన్ సాహా(54 : 39 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(21 నాటౌట్ ) ఆఖర్లో ధాటిగా ఆడాడు. దాంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది. ఐపీఎల్ ఫైనల్లో రికార్డు స్కోర్ చేసిన జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. 2016 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ కొట్టిన 208/7 స్కోర్ను అధిగమించింది.