సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నిన్న నాలుగో టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజు ఆట వర్షం వల్ల పలుమార్లు నిలిచిపోయింది. కేవలం 46 ఓవర్లు మాత్రమే బౌల్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటికే టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్నది. అయితే బుధవారం సిడ్నీ మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు .. ఇంగ్లండ్ ఫీల్డర్ జాక్ లీచ్ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జాక్ లీచ్.. ఓ అభిమాని బట్టనెత్తిపై సంతకం చేశారు. దీంతో ఆస్ట్రేలియా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మైదానంలోని క్రికెట్ అభిమానులకు లీచ్ ఫెవరేట్గా మారిపోయాడు. బోడనెత్తిపై స్పిన్నర్ లీచ్ సంతకం చేస్తున్న దృశ్యాలను స్టేడియంలో ఉన్న లైవ్ స్క్రీన్పైన కూడా చూపించారు. దానికి సంబంధించిన వీడియో ఇదే. ఆ ఫన్నీ మూమెంట్ను మీరూ చూడండి.