Iyer -Rahul | త్వరలో భారత వేదికగా ప్రపంచకప్ జరుగనున్నది. మెగా టోర్నీకి ముందు భారత క్రికెటర్లు గాయపడడం బీసీసీఐతోపాటు అటు అభిమానులు ఆందోళన వ్యక్తమవుతున్నది. కీలక బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు కోలుకోవడం కొంత ఊరటకలిగిస్తున్నది. బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఫిట్నెస్ను సాధించి మరోసారి టీమిండియాలోకి పునరాగమనం చేశారు. మరో కీలక ఆటగాడైన రిషబ్ పంత్ కోలుకుంటుండగా.. ఇప్పుడే మైదానంలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ల ఫిట్నెస్ బీసీసీఐతో పాటు టీమ్ మేనేజ్మెంట్కు సైతం ఆందోళన కలిగిస్తున్నది.
మెగా టోర్నీకి ముందు శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్ సాధిస్తే ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ప్రపంచకప్కు ముందు జరుగనున్న ఆసియా కప్కు కేఎల్ రాహుల్ దూరయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతను స్నాయువు గాయం నుంచి కోలుకోలేదని, అతనికి మరింత సమయం కావాలని పేర్కొన్నాయి. అలాగే శ్రేయాస్ అయ్యర్ భూజానికి గాయం కాగా.. ఫ్రాక్చర్ను సరి చేసేందుకు వీపు కింది భాగంలో సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు ఎప్పుడు మళ్లీ మైదానంలోకి దిగుతారనే విషయంపై బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతానికి ఆసియా కప్లో ఆడే ఛాన్స్ లేదని, ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ వరకైనా రాహుల్ ఫిట్నెస్ సాధించవచ్చని బీసీసీఐ భావిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కైనా రాహుల్ ఫిట్గా ఉండగలడని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది. వందశాతం ఫిట్గా ఉంటే అయ్యర్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని ఆలోచిస్తే.. రాహుల్ ప్రపంచకప్లో ఆడటం మరింత కష్టం కానుంది. ప్రస్తుతం రాహుల్ కీపింగ్ ప్రాక్టిస్ను ప్రారంభించాడు. ఇద్దరు రెండోస్థానంతో పాటు మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తారని, ఇందులో ఒకరైనా ఫిట్గా ఉండి ప్రపంచకప్కు అందుబాటులో ఉండాలని బీసీసీఐతో పాటు అభిమానులు సైతం కోరుకుంటున్నారు.