హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సత్తాచాటింది. హైదరాబాద్కు చెందిన 15 ఏండ్ల అనుగొండ శ్రీమాన్య రెడ్డి రన్నరప్ టైటిల్ చేజిక్కించుకుంది. చెన్నై వేదికగా జరిగిన టోర్నీ బాలికల డబుల్స్లో సవితతో కలిసి బరిలోకి దిగిన శ్రీమాన్య.. టోర్నీ ఆసాంతం రాణించింది. వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఈ జంట నిలకడైన విజయాలతో ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన తుదిపోరులో శ్రీమాన్య-సవిత జోడీ 3-6, 2-6తో సోనుశ్రీ-రేవతి ద్వయం చేతిలో ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది.