మలగ(ఇటలీ) : టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్షిప్గా భావించే డేవిస్కప్ను ఈ యేడాది ఇటలీ గెలుచుకున్నది. ఆదివారం జానిక్ సిన్నర్ రెండో సింగిల్స్ మ్యాచ్ను గెలవగానే ఇటలీ విజేతగా నిలిచింది. ఈ వారంలో తాను ఆడిన అయిదు మ్యాచ్లలో ఓటమి ఎరుగని సిన్నర్, సెమీస్లో సెర్బియాతో మ్యాచ్లో టాప్ ర్యాంకర్ జొకోవిచ్ను ఓడించి జట్టును ఫైనల్కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు. ఫైనల్స్ తొలి సింగిల్స్లో మాటియో ఆర్నాల్డ్ 7-5, 2-6చ 6-4తో అలెక్సీ పొపిరిన్పై గెలుపొంది శుభారంభం అందించగా, సిన్నర్ 6-3, 6-0తో అలెక్స్ డిమినార్ను ఓడించి అయిదు దశాబ్దాల తరువాత ఇటలీకి డేవిస్కప్ను అందించాడు. చివరిసారిగా ఇటలీ 1976లో డేవిస్కప్ను గెలుచుకున్నది. వచ్చే యేడాదికూడా డేవిస్కప్ ఫైనల్స్ను మలగలోనే నిర్వహించాలని నిర్ణయించారు.