లండన్: అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో ఒత్తిడిని జయించిన ఇటలీ యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్ చేరింది. వెంబ్లే స్టేడియంలో జరిగిన సెమీస్లో షూటౌట్ ద్వారా 4-2 తేడాతో స్పెయిన్ను ఇటలీ చిత్తుచేసింది. మ్యాచ్ సమయం ముగిసే నాటికి ఇరు జట్లు 1-1తో నిలిచాయి. మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి గోల్ 60వ నిమిషంలో నమోదైంది. ఇటలీ తరఫున ఫెజరికో చీసా గోల్ సాధిస్తే.. 80వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ అల్వరో మొరోటా సమం చేశాడు. దీంతో ఫలితం షూటౌట్కు చేరింది. షూటౌట్లో తొలి అవకాశాన్ని రెండు జట్లు చేజార్చుకున్నాయి. ఆ తర్వాత ఇటలీ ప్లేయర్లు వరుసగా నాలుగు సార్లు బంతిని పోస్ట్లోకి పంపగా.. స్పెయిన్ రెండుకే పరిమితమైంది. 2-3తో ఉన్న సమయంలో కీలకమైన అవకాశాన్ని స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ అల్వరో మొరాటా చేజార్చాడు. ఇక మరో సెమీస్లో ఇంగ్లండ్, డెన్మార్క్ తలపడనున్నాయి.