న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్ర పసిడి పతకం కొల్లగొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న టోర్నీలో సోమవారం భారత్కు నాలుగు పతకాలు దక్కాయి.
పురుషుల త్రీ పొజిషన్స్ టీమ్ ఫైనల్లో అనీష్ రజతం పొందగా.. విజయ్వీర్ సిద్ధు కాంస్యం కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో శివమ్ దబాస్ రజతం చేజిక్కించుకున్నాడు.