ISPL 2023: దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫ్రాంచైజీ క్రికెట్పై బాలీవుడ్ తారలు మనసు పారేసుకుంటున్నారు. ఇదివరకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్కు కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఉండగా.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పంజాబ్ ఓనర్గా ఉంది. అభిమానులు సంజూ బాబాగా గుర్తింపు పొందిన సంజయ్ దత్కు జింబాబ్వేతో పాటు శ్రీలంకలో జరిగే ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో పెట్టుబడులున్నాయి. తాజాగా మరికొందరు బాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ జాబితాలో తాజాగా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్లు చేరారు.
వచ్చే ఏడాది మొదలుకాబోయే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో బాలీవుడ్ స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. టెన్నిస్ బాల్తో ఆడబోయే ఈ లీగ్లో ఆరు టీమ్లున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, శ్రీనగర్లు తొలి సీజన్లో పోటీపడబోతున్నాయి. కాగా అక్షయ్ కుమార్ శ్రీనగర్ టీమ్ను సొంతం చేసుకోగా హృతిక్ రోషన్ బెంగళూరు టీమ్ను దక్కించుకున్నాడు.
T 4864 – What an exciting and most noble, filled with courage and care, concept, the initiation of the ISPL – the Street Premier league !
An opportunity for them that exhibited their capacity on the streets, gullies and make shift home made pitches to play cricket , now to… pic.twitter.com/RtI0O6h8zl
— Amitabh Bachchan (@SrBachchan) December 18, 2023
ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు అమితాబ్ బచ్చన్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఎస్పీఎల్ అనేది నోబెల్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకుందని, మట్టిలో మాణిక్యాలను గుర్తించేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తొలి ఎడిషన్లో భాగంగా 2024లో మార్చి 2 నుంచి 9 దాకా ముంబై వేదికగా సుమారు 19 మ్యాచ్లు ఆడించేలా నిర్వాహకులు ఇదివరకే ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Two superstars and their cities revealed! ⚡️⚡️
Four more to go!! 🌟 Can you guess who’s next? 🤔. Comment below now!
Register now at https://t.co/S4QoVw2oZQ ( link in bio )#EvoluT10n #NewT10era #Street2Stadium pic.twitter.com/ziHjEk0PmB
— ISPL (@ispl_t10) December 17, 2023