SRH vs PBKS : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్లే ఆఫ్స్ పోరుకు ముందు సూపర్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్యాన్ని ఊదేసి తాము ఛేజింగ్లోనూ మొనగాళ్లమే అని ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(66), హెన్రిచ్ క్లాసెన్(42), నితీశ్ రెడ్డి(37)లు వీరబాదుడు బాదడంతో సూపర్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్లో సన్వీర్ సింగ్(6 ) తొలి బంతికే బౌండరీ బాదడంతో కమిన్స్ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై గర్జించింది. పంజాబ్పై 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులుండగానే ఛేదించింది. రికార్డు స్కోర్లే కాదు రెండొందల టార్గెట్ను ఊదేయగలమని కమిన్స్ బృందం చాటింది. కొండంత లక్ష్యం ఛేదనలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(66) అర్ద శతకం బాదేశాడు. హర్షల్ పటేల్ ఓవర్లో బౌండరీతో యాభై బాదేశాడు.
అభిషేక్ శర్మ(66)
అయితే.. శశాంక్ ఓవర్లో షాట్ ఆడిన అభిషేక్.. శివం సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్(42) తీశ్ కుమార్ రెడ్డి(37)లు కూడా వీరవిహారం చేశారు. అయితే.. 11 బంతుల్లో 7 రన్స్ అవసరమైన టైమ్లో క్లాసెన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఒకింత ఉత్కంఠ నెలకొలింది. అయితే.. అబ్దుల్ సమద్(11 నాటౌట్), సన్వీర్ సింగ్(6 నాటౌట్)లు లాంఛనాన్ని పూర్తి చేసి హైదరాబాద్ జట్టు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించగలదని నిరూపించారు.
పదిహేడో సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(69) అర్ధ సెంచరీ బాదగా.. రీలే రసువో(49), అథర్వ తైడే(46) విధ్వంసం సృష్టించారు. ఆఖర్లో కెప్టెన్ జితేశ్ శర్మ(32 నాటౌట్) మెరుపు బ్యాటింగ్తో జట్టు స్కోర్ రెండొందలు దాటించాడు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది.
Innings Break!#PBKS have set a 🎯 of 2️⃣1️⃣5️⃣ , courtesy of an impressive batting display ❤️
Can #SRH chase it to strengthen their TOP 2️⃣ position? 🤔
Scorecard ▶️ https://t.co/K5rcY5Z8FS#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/05D8UFDnde
— IndianPremierLeague (@IPL) May 19, 2024