సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో అతనికి కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది. మధ్య వేలు, నాలుగవ వేలికి కుట్లు వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇశాంత్ గాయం సీరియస్గా లేదని తెలిపారు. పది రోజుల తర్వాత కుట్లు తీసివేస్తారన్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఆరు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా ఇశాంత్ కోలుకుంటాడని బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ ఫైనల్ మ్యాచ్లో ఇశాంత్ 31.2 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ సిరీస్కు 20 రోజుల బ్రేక్ ఉన్న కారణంగా.. టీమిండియా ప్లేయర్లు వింబుల్డన్, యూరో మ్యాచ్లను ఎంజాయ్ చేయనున్నారు. నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్లో ఆగస్టు 4వ తేదీ నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్నది.