IND vs AUS : స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(3) ఔటయ్యాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, 5 పరుగులకే మొదటి వికెట్ పడింది. శుభ్మన్ గిల్ (7), విరాట్ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 10 రన్స్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 రన్స్కు ఆలౌట్ అయింది. మిచెల్ మార్స్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు మాత్రం పరుగులు చేయగలిగింది. భారత పేసర్లు సిరాజ్, షమీ తలా మూడు వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బ కొట్టారు.