అహ్మదాబాద్: ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్తోనే జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో తిరిగి జట్టుతో పాటు ప్రపంచకప్నకూ ఎంపికై టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఇషాన్ కిషన్.. ఫైనల్కు ముందు తన ఆప్తులను కోల్పోయినా ఆ బాధనంతా దిగమింగి సత్తాచాటాడు. మ్యాచ్ ముగిశాక ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. ఈనెల 6న ఇషాన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు.
‘ఫైనల్కు ముందు ఈ విషయాన్ని నేనెవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో నాకు ఆప్తురాలైన నా సోదరి, బావ మరణించారు. నన్ను ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేది. ఈ విషయం తెలిసినవెంటనే నేను ఎంతో వేదనకు లోనయ్యా. కానీ ఇవాళ (ఫైనల్ జరిగిన రోజు) ఎంతో ప్రత్యేకం. భావోద్వేగాలను నియంత్రించుకుని ఆమె కోస మే పరుగులు చేశా. ఈ విజయం ఆమెకు అంకితం. మ్యాచ్లో నేను అర్ధ శతకం చేసిన తర్వాత ఆకాశం వైపు బ్యాట్ చూపించిందీ ఆమె కోసమే’ అని చెప్పుకొచ్చాడు.