Ishan Kishan | మూడు నెలల స్వల్ప విరామం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీ మ్యాచ్లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్లో ఆర్బీఐ టీమ్ తరఫున ఆడుతున్న ఇషాన్.. మంగళవారం రూట్ మొబైల్స్తో జరిగిన మ్యాచ్లో 12 బంతులాడి 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. 12 బంతుల్లో రెండు బౌండరీలు, ఒక భారీ సిక్సర్ సాయంతో 19 రన్స్ చేసిన ఇషాన్.. మ్యాక్స్వెల్ స్వామినాథన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
రూట్ మొబైల్స్ నిర్దేశించిన 193 పరుగుల ఛేదనలో భాగంగా ఓపెనర్గా వచ్చిన ఇషాన్.. రెండు ఫోర్లు, సిక్సర్తో దూకుడుగా ఆడేందుకు యత్నించినా అతడు ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వికెట్ కీపర్గా ఓ క్యాచ్తో పాటు స్టంప్ ఔట్ చేసిన ఇషాన్.. బ్యాట్తో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
#IshanKishan Playing for RBI in #DYPatilT20Cup
Ishan out on 19(11) against Route Mobile
🎥: DYPatilYT#CricketTwitter #TeamIndia
— Niche Sports (@Niche_Sports) February 27, 2024
డీవై పాటిల్ టీ20 కప్ కంటే ముందు ఇషాన్.. గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు. ఆ తర్వాత అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వ్యక్తిగత కారణాలతో సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశానికి వచ్చిన ఇషాన్.. మూడు నెలలుగా ఎటువంటి మ్యాచ్లూ ఆడలేదు. ఐపీఎల్ – 2024 తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఇషాన్.. ఈ టోర్నీలో రాణించి సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ఇదిలాఉండగా ఇదే టోర్నీలో ఆడుతున్న హార్ధిక్ పాండ్యా.. రిలయన్స్ 1 టీమ్కు కెప్టెన్గా ఉన్నాడు. సోమవారం బీపీసీఎల్తో జరిగిన మ్యాచ్లో హార్ధిక్.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.