హైదరాబాద్, ఆట ప్రతినిధి: భోపాల్ వేదికగా జరుగుతున్న కుమార్ సురేంద్రసింగ్ స్మారక జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషాసింగ్ 581 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో సీనియర్ షూటర్ రాహీ సర్నోబత్ (582), చింకీ యాదవ్ (575) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సొంతం చేసుకున్న ఇషాసింగ్..టోర్నీ టోర్నీకి రాటుదేలుతూ ప్రత్యేకతను దక్కించుకుంటున్నది.