న్యూఢిల్లీ: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను.. షూటర్ మనూ భాకర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో జరిగిన ఓ ఈవెంట్ వేళ.. షూటర్ మనూ భాకర్ తల్లి.. నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ కనిపించారు. ఆ ఇద్దరూ నీరజ్, మనూ కూడా మాట్లాడుకున్నారు. అయితే ఆ ముగ్గురూ మట్లాడుకున్న తీరు.. ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. నీరజ్, మనూ పెళ్లి చేసుకుంటారని కొందరు పోస్టులు పెట్టారు. అయితే ఆ సోషల్ మీడియా పోస్టులకు షూటర్ మనూ భాకర్ తండ్రి చెక్ పెట్టేశాడు. మనూ భాకర్ కు ఇంకా పెళ్లి ఈడు రాలేదన్నాడు.
మనూ భాకర్ చాలా చిన్న వయసున్న అమ్మాయి అని, ఆమెకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, దాని గురించి మేం ఆలోచించడం లేదని మనూ తండ్రి రామ్ కిషణ్ మీడియాతో తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలు కూడా లేనట్లు ఆయన స్పష్టం చేశారు. నీరజ్ను తన కుమారుడిలా మనూ తల్లి చూస్తున్నట్లు రామ్ కిషణ్ చెప్పారు. నీరజ్ బంధువు కూడా ఈ అంశంపై స్పందించారు. నీరజ్ మెడల్ తెస్తే దేశం మొత్తం అతనిపై ఆసక్తిని ప్రదర్శించిందని, అలాగే అతని పెళ్లి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఇక షూటర్ మనూ భాకర్.. రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నది.
Neeraj Chopra can be seen talking to the Manu Bhaker’s mother and into the other video, Neeraj Chopra and Manu Bhaker are discussing closely..!
I’m sorry but I don’t know why I am getting interested in Manu Bhaker and Neeraj Chopra 😜 pic.twitter.com/uymONMo8sj
— Priyanshu Kumar (@priyanshu__63) August 11, 2024