Irfan Pathan : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు. అతని ఫామ్ విషయంలో ఎవరూ కంగారు పడొద్దని తాను పదే పదే చెప్తున్నానని ఇర్ఫాన్ తెలిపాడు. ‘రోహిత్ సెంచరీ కొట్టకపోవడం అనేది అతని ఫామ్పై ప్రభావం చూపదు. అతని ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందకూడదని నేను తరచూ చెప్తున్నా. కివీస్పై రెండో వన్డేలో అతను అద్భుతమైన షాట్లు ఆడడం మనం చూశాం. రోహిత్ సరైన సమయంలో అర్థ శతకంతో మెరిశాడు’ అని ఈ మాజీ ఆల్రౌండర్ అన్నాడు. అంతేకాదు ‘స్వల్ప లక్ష్య ఛేదనలో సమస్య ఏంటంటే..? మొదటి బంతి నుంచి ధాటిగా ఆడాలనుకుంటారు కొందరు. కానీ, అది సరైన విధానం కాదు. రోహిత్ పరిస్థితులను అర్థం చేసుకొని, కుదురుకున్న తర్వాతే తనదైన షాట్లు ఆడాడు’ అని తెలిపాడు.
రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో భారత పేసర్లు విజృంభించడంతో కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ (51) హాఫ్ సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్కు అతను, శుభ్మన్ గిల్ కలిసి 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్ (40), కోహ్లీ (11), ఇషాన్ కిషన్(8)తో కలిసి జట్టును గెలిపించాడు. దాంతో, ఇండియా 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 24న ఇండోర్లో జరుగుతుంది.