ఎట్టకేలకు టీమిండియాలోకి పునరాగమనం చేసిన కేరళ ఆటగాడు సంజూ శాంసన్ (24 నాటౌట్) తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ రావడంతో అదరగొట్టాడు. అయితే అనవసరం షాట్లకు పోకుండా అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన్ కిషన్ (3) విఫలమైనా..
ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (26 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదడంతో భారత స్కోరుబోర్డు వేగంగా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే పవర్ప్లే ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.