IPL Mini Auction | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం డిసెంబర్ 23 న జరుగుతుంది. ఈ సారి కేరళలోని కొచ్చిలో వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీమ్లు ఈ వేలంలో పాల్గొననున్నాయి. గత మెగా వేలంలో ఈ టీమ్లకు వచ్చిన రూ.90 కోట్లను.. ఈసారి ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయనున్నాయి. పంజాబ్ అత్యధికంగా రూ.8.45 కోట్ల పర్స్ కలిగి ఉన్నది. వీటితో పాటు గత ఐపీఎల్లో తొలిసారిగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్ తమ పర్స్ మొత్తాన్ని ఖర్చు చేసింది. వారి దగ్గర కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఉన్నాయి.
మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15 నాటికి రిటైన్ చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. చివరి మెగా వేలం తర్వాత ఈ సంవత్సరం మినీ వేలం ఉంటుంది. రిటైన్ చేసేందుకు రవీంద్ర జడేజా పేరును చెన్నై సూపర్ కింగ్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే, శార్దూల్ ఠాకూర్తో పాటు నలుగురు ఆటగాళ్లను వేలానికి వదిలేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.