IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో షురూ కానుంది. దాంతో, చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్ టికెట్లను బీసీసీఐ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. మార్చి 18వ తేదీన ఉదయం 9ః30 గంటలకు పేటిఎమ్ ఇన్సైడర్(Paytm Insider)లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. టికెట్ల కోసం అభిమానులు పోటెత్తడంతో, సర్వర్ మోరాయించింది. దాంతో, టికెట్ల అమ్మకాలు నిలిచిపోయాయి.
ఊహించని పరిణామంతో షాక్ తిన్న సీఎస్కే, ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తూ పేటిఎమ్ ఇన్సైడర్ ప్రకటన విడుదల చేసింది. టికెట్ల సేల్ గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామని పేర్కొంది. అయితే.. టికెట్ ప్రింట్ అవుట్ అవసరం లేదని, ఫోన్లో ఈ- టికెట్లను చూపించినా సరిపోతుందని చెపాక్ స్టేడియం నిర్వాహకులు తెలిపారు.
#CSKvsRCB #csktickets #ipltickets pic.twitter.com/8FdP8ZRZnp
— Paytm Insider (@paytminsider) March 18, 2024
పదిహేడో సీజన్ మార్చి 22న చిదంబరం స్టేడియంలో ఆరంభం కానుంది. అదే రోజు జరిగే ఆరంభ పోరులో చెన్నై, ఆర్సీబీ తలపడనున్నాయి. దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఎదురుపడుతున్న ఈ మ్యాచ్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ధోనీ ఫేర్వెల్ సీజన్ కావడంతో, చెన్నై, సీఎస్కే మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టికెట్ ధరలు రూ. 1,700ల నుంచి రూ.7,500 మధ్య నిర్ణయించిన విషయం తెలిసిందే.