ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2023లో ఏ జట్టు తరఫున ఆడనున్నాడనే వార్తలకు తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అతడిని అట్టిపెట్టుకుంది. దాంతో వచ్చే సీజన్లో కూడా ఈ ఆల్రౌండర్ పసుపు రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ‘ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం మాతో కొనసాగనున్నాడు’ అని సీఎస్కే తమ ట్విట్టర్ ఖాతాలో జడేజా ఫొటోని పోస్ట్ చేసింది. జడేజా కూడా ఈ సీజన్లోనూ పసుపు రంగు జెర్సీలో ఆడనున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాదు ధోనికి వంగి నమస్కారం చేస్తున్న ఫొటోను జడేజా తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
పోయిన సీజన్లో సీఎస్కే కొన్ని మ్యాచ్ల తర్వాత జడేజాకు కెప్టెన్సీ అప్పగించింది. అయితే, మధ్యలోనే అతడని కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ ధోనికి బాధ్యతలు అప్పగించింది. దాంతో సీఎస్కే యాజమాన్యం మీద జడేజా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు అతను వచ్చే సీజన్లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున బరిలోకి దిగుతాడని అనుకున్నారు చాలామంది. కానీ, ధోనీ కోరిక మేరకు జడేజా సీఎస్కేతోనే కొనసాగేందుకు ఆసక్తి చూపించాడు. అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2023కి జడేజాని చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. మోకాలి గాయం కారణంగా జడేజా టీ 20 వరల్డ్ కప్లో ఆడలేకపోయాడు.
Everything is fine💛 #RESTART pic.twitter.com/KRrAHQJbaz
— Ravindrasinh jadeja (@imjadeja) November 15, 2022