IPL 2023 : భారత యువ బౌలర్ శివం మావి వేలంలో భారీ ధర పలికాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ఈ ఫాస్ట్ బౌలర్ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస ధరతో ఉన్న మావిని దక్కించుకునేందుకు గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ మొదటి నుంచి ఆసక్తి చూపించింది. ఈ వేలంలో ఎక్కువ ధర పలికిన భారత బౌలర్గా శివం మావి నిలిచాడు.
పోయిన సీజన్లో శివం మావి, కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అప్పుడు అతడిని వేలంలో రూ.7.20 కోట్లకు కేకేఆర్ మళ్లీ దక్కించుకుంది. అయితే, 5 వికెట్లు మాత్రమే తీయడంతో అతడిని వదిలించుకుంది. మావి 2018లో ఐపీఎల్లో ఆరంగ్రేటం చేశాడు. అప్పుడు అతనికి 19 ఏళ్లు. ఏమంత అనుభవం లేని అతడిని కేకేఆర్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతను 2018లో అండర్ 19 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.