IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్కు మరోసారి ఎన్నికల సెగ తగిలింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ను ఆసల్యంగా ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మ్యాచ్ వేదికల్లో మార్పులు చేసింది. మాజీ ఛాంపియన్లు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ వేదకలను మార్చింది. అహ్మదాబాద్తో పాటు గుజరాత్లోని పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.
భారీ స్కోర్ల మ్యాచ్లు, ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తున్న పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ మారనుంది. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ.. కీలక మ్యాచ్ల వేదికలను మార్చింది బీసీసీఐ. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న .. అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు తలపడాలి.
🚨 NEWS 🚨@gujarat_titans – @ChennaiIPL fixtures swapped for April 26 and May 21, owing to municipal corporation elections in Ahmedabad and other parts of Gujarat!
More Details 🔽 | #TATAIPL | #KhelBindaashttps://t.co/xDibwhhT8C
— IndianPremierLeague (@IPL) April 13, 2026
అయితే.. గుజరాత్ వ్యాప్తంగా అదే రోజున మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున.. వేదికను చిదంబరం స్టేడియానికి మార్చింది బీసీసీఐ. చెపాక్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు గుజరాత్, చెన్నై మ్యాచ్ జరుగనుంది. అలానే మే 21న చెన్నై సొంత మైదానంలో ఇరుజట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను అహ్మదాబాద్కు తరలించారు.