IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్కు సర్వం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో చెన్నై – బెంగళూరు మధ్య తొలిమ్యాచ్తో ఈ సీజన్కు నాంది పడనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యంత ధర పలికిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ భారత్కు వచ్చేశాడు. కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన వేలం ప్రక్రియలో కోల్కతా నైట్ రైడర్స్.. రూ. 24.50 కోట్లు వెచ్చింది స్టార్క్ను కొనుగోలు చేసింది. ఆదివారం రాత్రి స్టార్క్ కోల్కతాకు చేరుకున్నాడు.
ఈ మేరకు కేకేఆర్ తమ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో స్టార్క్ కోల్కతాకు విచ్చేసిన వీడియోను పోస్ట్ చేసింది. సుదీర్ఘకాలం తర్వాత ఐపీఎల్ ఆడనున్న స్టార్క్పై ఈ సీజన్లో కోల్కతా భారీ ఆశలే పెట్టుకుంది. 2014 తర్వాత ట్రోఫీ నెగ్గని ఆ జట్టు.. ఈసారి ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. 2012, 2014లలో కేకేఆర్కు ట్రోఫీలు అందించిన కెప్టెన్ గౌతం గంభీర్.. ఈసారి టీమ్కు మెంటార్గా ఉండనున్నాడు. గత సీజన్కు దూరమైన శ్రేయస్.. ఈ సీజన్లో మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
Dil thaam ke baith jaao Kolkata, mausam bigadne waala hai! ⚡ pic.twitter.com/K8Gqs9h778
— KolkataKnightRiders (@KKRiders) March 18, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో కేకేఆర్.. తమ తొలి మ్యాచ్ను ఈనెల 23న ఈడెన్ గార్డెన్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఐపీఎల్ ఆరంభానికి ముందే కేకేఆర్.. ప్రాక్టీస్ మ్యాచ్లతో సీజన్ కోసం సన్నద్ధమవుతున్నది.
#KnightWrap 17.03.24 👉 Sight of the Tiger 🐅 pic.twitter.com/fKvmfXigKE
— KolkataKnightRiders (@KKRiders) March 17, 2024