MI vs DC | ముంబై ఇండియన్స్కు షాక్ తగిలింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ ( 27 బంతుల్లో 49 పరుగులు ) ఏడో ఓవర్లో ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 49 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని హిట్మ్యాన్ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (25), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఏడు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి ముంబై 80 పరుగులు చేసింది.