PBKS New Stadium | ఐపీఎల్లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటిగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ హోంగ్రౌండ్ను మార్చుకుంది. 2008 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియమే సొంత గ్రౌండ్గా ఉంది. కానీ వచ్చే నెల 22 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ – 2024లో మాత్రం పంజాబ్.. తమ హోమ్ మ్యాచ్లను ముల్లాన్పూర్లో నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో ఆడనుంది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
మొహాలీలోని పీసీఏ స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వేదికలో ఇంతవరకూ అంతర్జాతీయ మ్యాచ్లు జరుగలేదు. కానీ దేశవాళీలో మాత్రం సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తో పాటు గత రెండు సీజన్లుగా రంజీ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తోంది. 33 వేల మంది సీటింగ్ కెపాజిటీ కలిగిన ఈ స్టేడియాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించి వాన నీటిని అరగంటలోనే క్లీన్ చేసే అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ను ఏర్పాటుచేశారు. ఐపీఎల్-17లో భాగంగా పంజాబ్.. మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడబోయే తొలి హోంమ్యాచ్ను ఈ స్టేడియంలోనే ఆడనుంది.
𝐀 🆕 𝐊𝐢𝐧𝐠𝐝𝐨𝐦 𝐢𝐬 𝐟𝐨𝐫𝐦𝐞𝐝! 👑#SherSquad, brace yourselves to witness our 🦁s reign from their majestic new den at the Maharaja Yadavindra Singh Cricket Stadium in Mullanpur, Mohali in #IPL2024! 🏠🏟️#SaddaPunjab #PunjabKings #JazbaHaiPunjabi pic.twitter.com/x5t6RjWYcR
— Punjab Kings (@PunjabKingsIPL) February 26, 2024
గత సీజన్లో పంజాబ్.. మొహాలీతో పాటు తమ హోంమ్యాచ్లను ధర్మశాల, ఇండోర్లలో ఆడిన విషయం తెలిసిందే. తాజా సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విడత షెడ్యూల్లో రెండు మ్యాచ్లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కాకుండా వైజాగ్లో ఆడబోతున్న విషయం విదితమే.