IPL 2024 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బాలీవుడ్ సూపర్స్టార్, కోల్కతా ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ ఖాన్ ముంబై నుంచి చెన్నైకి బయలుదేరారు. ఇన్స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో షారూక్తోపాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ముంబై ఎయిర్పోర్టు లోపలికి వెళ్తూ కనిపించారు. వారిలో షారూఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా, చిన్న కుమారుడు అబ్రామ్ ఉన్నారు.
ఐపీఎల్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించడంతో అదేరోజు టీమ్తో కలిసి షారూఖ్ ఖాన్ సంబరాలు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు వడదెబ్బ తగిలి ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడ కోలుకోవడంతో కుటుంబంతో కలిసి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చెన్నైకి బయలుదేరారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ – కోల్కతా నైట్రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.