IPL | ముంబై : ఐపీఎల్-17లో రెండు మ్యాచ్లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈనెల 17న ఈడెన్ గార్డెన్ వేదికగా జరగాల్సి ఉన్న కోల్కతా-రాజస్థాన్ మ్యాచ్ ను ఒక రోజు (ఏప్రిల్ 16) ముందే నిర్వహించనున్నారు. శ్రీరామ నవమితో పాటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేశారు. మరోవైపు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-ఢిల్లీ మధ్య ఏప్రిల్ 16న జరగాల్సిన మ్యాచ్ ను మరుసటి రోజు(ఏప్రిల్ 17)న నిర్వహించనున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.