IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పేశారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉండడంతో టాస్ ఆలస్యం కానుంది. వర్షం తగ్గాక అంపైర్లు మ్యాచ్ సాధ్యపడుతుందా? ఓవర్లు కుదించాలా? లేదంటే సూపర్ ఓవర్ ఆడించాలా? అనే విషయమై నిర్ణయానికి రానున్నారు. రిజర్వ డే రోజున టైటిల్ పోరు నిర్వహిచండంపై కూడా చర్చించనున్నారు.
ఒకవేళ 9ః35 గంటలకు వర్షం తగ్గకుంటే రిజర్వ్ డేన అంటే.. రేపు ఫైనల్ జరుగుతుంది. వాన తగ్గితే 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకుంటే కనీసం 5 ఓవర్లు అయినా ఆడిస్తారు. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో పంజా విసిరింది. చాంపియన్ ఆటతో బలమైన ముంబై ఇండియన్స్ను 62 రన్స్తో చిత్తు చేసింది. సొంత గ్రౌండ్లో గొప్ప రికార్డు ఉన్న గుజరాత్, చెన్నైకి షాకివ్వాలనుకుంటుంది. కానీ, మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన తెలివైన వ్యూహాలతో మ్యాచ్ను చెన్నై వైపు తిప్పగల దిట్ట. దాంతో, విజేతగా నిలిచేది ఎవరో ఫస్ట్ ఇన్నింగ్స్తో దాదాపు తెలుస్తుంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ ఫైనల్లో గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 ఫైనల్లో అతడు ట్రోఫీ సాధించాడు. ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా 4 ఫైనల్స్(2015, 2017, 2019, 2020) ఆడాడు. వాటన్నింటిలో ముంబై కప్పు కొట్టింది. గత సీజన్లో పాండ్యా గుజరాత్ను ఫైనల్ చేర్చాడు. రాజస్థాల్ రాయల్స్ను ఓడించి గుజరాత్ ట్రోఫీ అందుకుంది.