ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన ఏడాది ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదనే చెప్పాలి. ఆరంభ సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, ఇటీవల కన్నుమూసిన షేన్ వార్న్ కెప్టెన్సీలో ఐపీఎల్ కప్పు కొట్టిందా జట్టు. ఆ తర్వాత ప్లేఆఫ్స్కు వెళ్లడం కూడా గగనమే అనేలా తయారైంది.
ఇలాంటి సమయంలో ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్న ఆర్ఆర్ యాజమాన్యం.. మెగావేలంలో మంచి ఆటగాళ్లను దక్కించుకున్నారు. ఇప్పుడు మాజీ శ్రీలంక పేసర్, ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లసిత్ మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది.
ఈ మేరకు రాజస్థాన్ జట్టు ప్రకటించింది. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లసింత్ మలింగ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికి బౌలింగ్ కోచ్గా మారాడు. జట్టు పేస్ బౌలింగ్ కోచ్గా మలింగను నియమించడంపై రాజస్థాన్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న కుమార సంగక్కర సంతోషం వ్యక్తం చేశాడు. మలింగ నుంచి యువ పేసర్లు చాలా నేర్చుకుంటారని అన్నాడు. వీళ్లిద్దరూ శ్రీలంక జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన సంగతి తెలిసిందే.
అలాగే 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియాకు మెంటల్ కండిషన్ కోచ్గా సేవలందించడమే కాకుండా.. 2011 నుంచి 2014 సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా రాణించిన సమయంలో ఆ జట్టుకు పెర్ఫామెన్స్ డైరెక్టర్గా విధులు నిర్వహించిన ప్యాడీ అప్టాన్ను జట్టు క్యాటలిస్ట్గా నియమించినట్లు రాజస్థాన్ యాజమాన్యం తెలిపింది. అంతకుముందు 2013-15 సమయంలో, ఆ తర్వాత 2019లో ప్యాడీ అప్టాన్.. రాజస్థాన్ జట్టుకు హెడ్ కోచ్గా కూడా వ్యవహరించాడు.
*𝐤𝐢𝐬𝐬𝐞𝐬 𝐭𝐡𝐞 𝐛𝐚𝐥𝐥*
Lasith Malinga. IPL. Pink. 💗#RoyalsFamily | #TATAIPL2022 | @ninety9sl pic.twitter.com/p6lS3PtlI3
— Rajasthan Royals (@rajasthanroyals) March 11, 2022