తాజా ఐపీఎల్ సీజన్లో చాలా తక్కువ మంది యువ ఆటగాళ్లే సత్తా చాటుతున్నారు. వారిలో ప్రముఖంగా కనిపిస్తున్న కుర్రాడు లక్నో బ్యాటర్ ఆయుష్ బదోని. గుజరాత్పై తను ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే 54 పరుగులు చేసిన బదోని.. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా మంచి ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు.
తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలో బదోనిపై మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఐపీఎల్లో దొరికిన ఆణిముత్యం అతనని కొనియాడాడు.
‘‘ఢిల్లీ మ్యాచ్ను అతను ముగించిన విధానం.. ముఖ్యంగా ఎదుర్కొన్న కొన్ని బంతుల్లోనే క్వాలిటీ షాట్లు ఆడటం చూస్తే.. అతనో నిజమైన ట్యాలెంట్ అని అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో దొరికిన ఆణిముత్యం ఇతనేనేమో?’’ అన్నాడు. ఇటీవల లక్నో కెప్టెన్ రాహుల్ కూడా బదోనిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.