ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన చెన్నై జట్టు సభ్యులు.. సూరత్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు ముంబైకి చాలా దగ్గరగా ఉంటాయనే కారణంతో దీన్ని ప్రాక్టీస్ వెన్యూగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కెప్టెన్ ధోనీ, అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్పాండే తదితరులు మార్చి 2నే హోటల్లో దిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్న ఈ ప్లేయర్లు.. ఇక్కడి లాల్భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈసారి ఐపీఎల్ ప్రారంభమయ్యేది చెన్నై మ్యాచ్తోనే. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మార్చి 26 సాయంత్రం 7.30 గంటలకు మొదటి మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్ మ్యాచులు అన్నీ ముంబై, పూణేల్లోని స్టేడియాల్లోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Shubh Aarambh @ Surat! ✨#SingamsInSurat #WhistlePodu 🦁💛
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022
Bowling aa? Fielding aa? Vaathis in the house!#SingamsInSurat #WhistlePodu pic.twitter.com/98p6336INx
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022