ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు టోర్నీ ప్రారంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టులో కీలకమైన ఆల్రౌండర్ మొయీన్ అలీ.. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడాల్సి ఉంది.
అయితే వీసా పేపర్లు అందని కారణంగా మొయీన్ అలీ లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అలీకి సాయం చేసేందుకు బీసీసీఐ కూడా రంగంలోకి దిగిందని ఇటీవలే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా చెప్పారు. అయితే అతనికి ఇంకా వీసా దక్కలేదని, కాబట్టి మొదటి మ్యాచ్కు అలీ అందుబాటులో ఉండటం చాలా కష్టమని విశ్వనాథన్ తెలిపారు.
ఒకట్రెండు రోజుల్లో ఈ సమస్య తీరితే, అలీ వెంటనే జట్టుతో చేరతాడని చెప్పారు. అయితే మిగతా ఆటగాళ్లను కలిసే ముందు అలీ మూడ్రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 26న జరిగే తొలి మ్యాచ్లో అలీ ఆడటం దాదాపు కుదరదు.