మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు. శ్రీలంక-భారత్ టెస్టులకు అయితే పూర్తి సామర్ధ్యంతో ప్రేక్షకులను అనుమతించారు.
ఈ క్రమంలో ఐపీఎల్కు కూడా ప్రేక్షకులను పూర్తిగా అనుమతిస్తారా? అంటే కాదనే తెలుస్తోంది. మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15.. మహారాష్ట్రలోని పూణే, ముంబై నగరాల్లోని స్టేడియాల్లోనే పూర్తిగా జరగనుంది. ఈ స్టేడియాల్లో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
అంతేకాదు, టోర్నీ ముందుకు సాగేకొద్దీ ఈ ప్రేక్షకుల సంఖ్యను పెంచుతూ వెళ్తామని వెల్లడించింది. ఈ నెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ ప్రారంభం కానుంది.