ఐపీఎల్ చరిత్రలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అరుదైన ఘనత సాధించాడు. నెహ్రా హెడ్ కోచ్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతోనే నెహ్రా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. ఐపీఎల్లో ఆటగాడిగా, హెడ్ కోచ్గా ట్రోఫీ అందుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇంతకుముందు ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజాలు షేన్ వార్న్, డారెన్ లెహ్మాన్, రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నెహ్రా కూడా వీరి సరసన చేరాడు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన నెహ్రా.. ఆ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాడు. మళ్లీ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్గా మరో ట్రోఫీ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేకాదు, హెడ్ కోచ్గా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన తొలి భారత క్రీడాకారుడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక్క భారతీయ కోచ్ కూడా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గకపోవడం గమనార్హం.