ఖరీదైన క్రికెట్ పండుగ ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈసారి ఛాంపియన్గా నిలిచే జట్టు ఏదో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మెగావేలం తర్వాత అన్ని జట్టూ సూపర్ జట్లలాగే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్న జట్లూ ప్రాక్టీస్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు ముంబై చేరుకుంది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇక్కడకు చేరుకున్న సభ్యులందరూ మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. దీని గురించి పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ‘‘ఈ మూడు రోజుల కఠినమైన క్వారంటైన్లో ఫొటోలు ఎడిట్ చేసుకుంటూ గడిపేస్తా’’ అని చెప్పాడు.
క్రికెట్ తర్వాత తనకు బాగా నచ్చిన పని ఫొటోగ్రఫీ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడీ లెజెండరీ స్పిన్నర్. ఇదే విషయాన్ని ఇప్పుడు మరోసారి గుర్తుచేశాడు. ఈ నెల 26వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే తొలి ఐపీఎల్ మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలవుతుంది. చెన్నైకు ఎప్పట్లాగే ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తుండగా.. కోల్కతా జట్టుకు భారత యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.